న్యూఢిల్లీ : ఇండియన్ ఏసీ రైల్వే కోచ్లలో ప్రయాణికుల చేతివాటం సంచలనంగా మారింది. రైళ్లలోని ఏసీ కోచ్లలో పడుకోవడానికి బెడ్ రోల్ (రెండు బెడ్షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, దిండు కవర్, టవల్) ఏర్పాటు చేస్తారు. అయితే ఈ బెడ్రోల్స్ను కొందరు ప్రయాణికులు ఎత్తుకెళ్తున్నట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం వెల్లడించింది. 2022 నుంచి 2026 వరకు 1.27 కోట్ల బెడ్రోల్స్ ఎత్తుకెళ్లారని ఈ కథనం తెలిపింది. ప్రతి వెయ్యి మంది ప్రయాణికుల్లో ఒకరు బెడ్షీట్ లేదా దుప్పటిని తీసుకెళ్తున్నారని రైల్వే అధికారులు తెలిపినట్టు ఈ కథనం పేర్కొంది.
ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రతినిధులు దేశంలోని 54 డివిజన్లలో, 16 జోన్లలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా ఈ వివరాలు బయటకొచ్చినట్టు తెలిపింది. 2022 నుంచి 2025 మధ్య ఈ దొంగతనాలు 56 శాతం పెరిగాయని ఈ కథనం తెలిపింది. అయితే వీటిని అదుపు చేయడానికి తీసుకుంటున్న చర్యలను మాత్రం ఈ కథనంలో వెల్లడించలేదు. ఏసీ కోచ్లలో ఆర్థికంగా ఉన్నవాళ్లే ఉంటారు. అలాంటిది వారు ఇలా బెడ్షీట్లను తీసుకెళ్లడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.