నల్లగొండ : రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. 2019-2020 విద్యాసంవత్సరానికి బీసీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో ఉత్తమ అవార్డుకు ఎంపికైన నందికొండ బీసీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్రెడ్డి, అధ్యాపకులు సునీత, జగన్, కృష్ణ, యాదగిరి, శ్రీధర్రెడ్డి, రజనీకాంత్, కృష్ణమూర్తిలను ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సన్మానించారు.
అనంతరం వారికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ప్రభుత్వ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. నందికొండలో డిగ్రీ కళాశాల ఏరాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు