కలెక్టర్ వెంకట్రావు
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
మహబూబ్నగర్, జూన్ 7 : రైతులకు రై తుబంధు రావాలంటే ధరణి పోర్టల్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం పంపించిన నూత న చెక్ మెమోలో దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన వివరాలను పంపించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలును నాలుగు, ఐదు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీసీలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్, డీఆర్వో కెస్వర్ణలత ఉన్నారు.
2 కోట్ల విత్తన బంతులు తయారు
ఈ ఏడాది వర్షాకాలంలో రెండు కోట్ల విత్తన బంతులను తయారు చేసి వెదజల్లుదామని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం డీఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ను ప్ర త్యేకంగా పరిశీలించారు. హరితహారంలో భాగంగా గత సంవత్సరంలా మహిళా సం ఘాల ద్వారా కోటి విత్తన బంతులు తయా రు చేయాలని, ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, ఏపీడీలు శారద, నాగమల్లిక, తదితరులు ఉన్నారు.
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తాం
అదనపు కలెక్టర్ సీతారామారావు
ప్రతి ఫిర్యాదునూ పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి వాట్సాప్ కాల్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాసుపుస్తకాలు, భూముల సమస్యలపై, మహబూబ్నగర్లో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చాయని తెలియజేశారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ తెలియజేశారు.