నీలగిరి, జూన్ 4 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో ఎన్నో సంసరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్ నుంచి నిర్వహించిన సురక్షా దినోత్సవ ర్యాలీని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి మర్రిగూడ బైపాస్, క్లాక్టవర్ వరకు పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోట్స్, ఫైర్ వెహికిల్స్తో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించి పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు, డాగ్ స్వాడ్ విన్యాసాలు, పోలీస్ రక్షణ కవచాలు, బాంబ్ స్వార్డ్ పనిచేసే విధానం, షీ టీమ్స్, భరోసా, చిన్నపిల్లల సంరక్షణ చట్టాలు, ట్రాఫిక్ విభాగం, బాడీ కెమెరాలు, వివిధ పరికరాల గురించి వివరించారు. పోలీస్ జాగిలాల నైపుణ్యాల గురించి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే మనందరికీ స్వేచ్ఛ వచ్చిందన్నారు.
రాష్ట్రం ఏర్పడి 9సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా అన్ని శాఖలు సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాగానే మొదటగా పోలీస్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించి బలోపేతం చేసి శాంతిభద్రతలను అదుపు చేశారన్నారు. ప్రభుత్వం పోలీస్ స్టేషన్లను దేవాలయాలుగా తీర్చిదిద్దిందని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉన్న కమాండ్ కంట్రోల్ వ్యవస్థ మాదిరిగా జిల్లాలో కూడా ఉండాలని అన్నారు. గంజాయిని అరికట్టడంలో జిల్లా పోలీసుల ప్రత్యేక కృషి ఉన్నదని, బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్న జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతిభద్రతలకు ప్రాముఖ్యత ఇచ్చినందునే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
పోలీసు సంక్షేమానికి తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రకటించారు. కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వం సురక్షా దినోత్సవం నిర్వహించిందన్నారు. ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయిస్తున్నదన్నారు. జిల్లాకు 40 పెట్రోలింగ్ వాహనాలు, 100కు పైగా పెట్రోలింగ్ బైకులు, కంప్యూటర్లు, ట్యాబ్లు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కేటాయించడం వల్లే డయల్ 100 కాల్ రాగానే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అకడికి చేరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 775 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు కమాండ్ కంట్రోల్ పరిధిలో పనిచేస్తున్నాయన్నారు.
నల్లగొండ జిల్లాలో దాదాపు 7వేల సీసీ కెమెరాలు ఉన్నట్లు, వాటి ద్వారా అనేక కేసులను ఛేదించినట్లు తెలిపారు. షీ టీమ్స్, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు అనేక రక్షణ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాసర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాలొన్నారు.