యాదగిరిగుట్ట, మార్చి 3 : సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మంగళవా రం ఆలయ ప్రధానార్చకులు, ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు గ్రస్తోదయ చంద్ర గ్రహ ణం కొనసాగింది. అంతకుముందు ఉదయం 3 గంటలకు ప్రధానార్చక బృందం ఆలయాన్ని తెరిచి ఆరగంట పాటు సుప్రభాత సేవ కొనసాగించారు. అర్చనలు, బాలభోగం ముగించి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
అనంతరం 7 గంటలకు ద్వారాబంధనం గావించి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి గ్రహణ దోష పరిహారార్థం, సంప్రోక్షణ ఆలయ శుద్ధి చేపట్టి స్వామి, అమ్మవార్ల నిత్యకైంకర్యాలను ప్రారంభించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆలయాన్ని మూసివేయడంతో యాదాద్రి పరిసర ప్రాంతాలను నిర్మానుష్యంగా మారాయి. క్యూలైన్లు, మాడవీధులు భక్తులు లేక బోసిపోయాయి.