యాదగిరిగుట్ట, డిసెంబర్ 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పాత గుట్ట క్షేత్రంలో శనివారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారు వైకుంఠనాథుడిగా ఉదయం 6.42నుంచి 8గంటల వరకు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. అనంతరం వైకుంఠనాథుడిని గరుఢ వాహనంపై తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. భక్తులతో ప్రధానాలయ ప్రాంగ ణం కిక్కిరిసింది. కాగా, లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఉదయం తొళక్కంతో అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం విష్ణుమూర్తిని మత్స్యావతారంపై అలంకరించి సేవను ఊరేగించారు. అధ్యయనోత్సవాల్లో భా గంగా స్వామివారు ఆదివారం ఉదయం వేణుగోపాలస్వామి, సాయంత్రం గోవర్ధనగిరిదారిగా దర్శనమివ్వనున్నారు.
యాదగిరిగుట్ట, డిసెంబర్ 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పాత గుట్ట క్షేత్రంలో శనివారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారు వైకుంఠనాథుడిగా ఉదయం 6.42నుంచి 8గంటల వరకు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. అనంతరం వైకుంఠనాథుడిని గరుఢ వాహనంపై తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. భక్తులతో ప్రధానాలయ ప్రాంగ ణం కిక్కిరిసింది. కాగా, లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఉదయం తొళక్కంతో
అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం విష్ణుమూర్తిని మత్స్యావతారంపై అలంకరించి సేవను ఊరేగించారు. అధ్యయనోత్సవాల్లో భా గంగా స్వామివారు ఆదివారం ఉదయం వేణుగోపాలస్వామి, సాయంత్రం గోవర్ధనగిరిదారిగా దర్శనమివ్వనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పాతగుట్టక్షేత్రంలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని ఉత్తర ద్వారం గుండా ఉదయం 6:42 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు గంటన్నరపాటు వైకుంఠనాథుడి దర్శనభాగ్యం భక్తులకు కల్పించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. నమోః నారసింహ అంటూ.. జయజయ ధ్వానాలు చేశారు. శుక్రవారం రాత్రికే యాదగిరిగుట్టకు చేరుకున్న భక్తులు పెద్దఎత్తున శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని వైకుంఠద్వారం గుండా దర్శించుకునేందుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుథ్రెడ్డి, వరంగల్(పశ్చిమ) ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ హనుమంత్ కే జెండగే, డీఐజీ సత్యనారాయణ, జిల్లా న్యాయమూర్తులు మారుతీదేవి, దశరథరామయ్య, ఆలేరు కోర్టు న్యాయమూర్తి సుమలత, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, ఆలయ అనువంశిక
ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ పాల్గొన్నారు.
తరలివచ్చిన భక్తజనం..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తన్మయులయ్యారు. యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలో రెండోసారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. భక్తులు జై నారసింహా, జై జై నారసింహా అంటూ స్మరించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిశాయి. వేకువజామునే చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు వేడుకల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించిన అనంతరం వైకుంఠనాథుడిని గరుఢ వాహనంపై తిరుమాఢవీధుల్లో ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశింపజేసి వెలుపలి ప్రాకార మండపంలో వేంచేపు సేవకు ముగింపు పలికారు. సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వారం గుండా లోపలికి అనుమతినిచ్చి స్వామివారి దర్శనం కల్పించారు. అలాగే జిల్లాలోని పలు ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు.
అధ్యయనోత్సవాలకు శ్రీకారం..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఉదయం అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొళక్కంతో అధ్యయనోత్సవాలను ప్రారంభించారు. స్వామివారిని గరుఢ వాహనంపై వైకుంఠనాథుడిగా దర్శనమివ్వగా మధ్యాహ్నం స్వామివారి అలంకార సేవను ఊరేగించారు. సాయంత్రం విష్ణుమూర్తిని మత్స్యావతారంపై అలంకరించి సేవను ఊరేగించారు. అలంకార సేవలో ఆగమశాస్ర్తానుసారంగా స్వామివారికి పురప్పాట్ సేవ నిర్వహించారు. పారాయణికులచే ద్రావిడ ప్రబంధ సేవకాలం వైభవంగా సాగింది. పశ్చిమ సప్తతల రాజగోపురం గుండా మాఢవీధుల్లో ఊరేగించారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి సేవ ఆలయంలోని వెలుపలి ప్రాకార మండపంలో వేంచేపు చేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆధ్యాత్మికతను వివరించేలా చేపట్టిన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవులపల్లి శ్రీదేవి, సిస్టర్స్ సంగీత ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. స్వామి సేవ కాలంలో కోలాటం, నృత్య ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు.
లక్ష్మీనరసింహుడికి నిత్యారాధనలు..
లక్ష్మీనారసింహుడి నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. నారసింహుడికి ప్రాతఃకాల తిరువారాధన, ధనుర్మాసోత్సవంలో భాగంగా తిరుప్పావై సేవ, బాలభోగం, ఆరగింపు, చాత్మరై జరిపారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.32,62,548 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
నేడు అలంకార సేవలు..
స్వామివారి అధ్యయనోత్సవాలలో భాగంగా ప్రధానాలయంలో స్వామివారు ఆదివారం ఉదయం వేణుగోపాల స్వామి అలంకారంలో, సాయంత్రం గోవర్ధనగిరి దారి అలంకార సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.