యాదాద్రి : భద్రాద్రి కట్టిన గొప్ప భక్తుడు శ్రీరామదాసు అయితే, యాదాద్రిని కట్టిన నవయుగ భక్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సోషల్ మీడియా బృందంతో పర్యటించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రారంభానికి సిద్ధమవుతున్న యాదాద్రి నూతనాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నృసిండి యాదాద్రి ఆలయం రాష్ట్రానికే తలమానికం అన్నారు. సీఎం కేసీఆర్ భక్తి, ఆయన పట్టుదల వల్లే యాదాద్రి నిర్మాణం సాధ్యమైందని కొనియాడారు.
హిందూ మతాన్ని రాజకీయంగా వినియోగిస్తున్న పెద్దపెద్ద జాతీయ పార్టీలు చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపించారని చెప్పుకొచ్చారు. తెలంగాణ తిరుపతి అయిన యాదాద్రి ఘనతను ప్రపంచమంతా చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. యాదాద్రీశుడి దయా, కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు.