యాదగిరిగుట్ట, యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదాద్రి (Yadadri) కి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో కొండప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు రాక వల్ల స్వామివారికి ఆదివారం ఒక్కరోజే రూ. 54,09,081 ఆదాయం (Income) వచ్చిందని ఆలయ ఈవో గీత వివరించారు.
ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 2,23,900, కైంకర్యముల ద్వారా రూ. 2,200, సుప్రభాతం ద్వారా రూ.11,600, బ్రేక్ దర్శనం(Break Darsan) ద్వారా రూ.4,09,500 ఆదాయం సమకూరిందని తెలిపారు. వ్రతాలు చేయడం వల్ల రూ. 2,54,400, వాహన పూజల ద్వారా రూ. 23,600, వీఐపీ దర్శనాల వల్ల రూ. 8,10,000, ప్రచారశాఖ ద్వారా రూ. 94,164, పాతగుట్టలో పూజల వల్ల రూ. 54,900 వచ్చిందన్నారు.
కొండపైకి వాహన ప్రవేశాల వల్ల రూ. 8,00,000, యాదఋషి నిలయం ద్వారా రూ. 2,06,802, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,12,516, శివాలయం ద్వారా రూ.11,200, పుష్కరిణీ ద్వారా రూ. 3,050 ఆలయానికి ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రసాద విక్రయం ద్వారా రూ. 21,96,850, శాశ్వత పూజల ద్వారా రూ. 2,500, కళ్యాణ కట్ట ద్వారా రూ.1,25,000, మొక్కు వస్త్రాల వేలం వల్ల రూ. 47,850, అన్నదానం ద్వారా రూ. 19,049 ఆదాయం వచ్చిందని తెలిపారు.