యాదాద్రి: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. త్వరలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న ట్లు తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో ధాన్యం కొనుగోలు ధరల గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ రకం వరికి మద్దతు ధర క్వింటాలుకు రూ.1,940, ఏ గ్రేడ్కు రూ.1,9 60 ఇస్తున్నట్లు తెలిపారు. 8 శాతం తేమ గల పొడువు పింజ రకం పత్తి క్వింటాల్కు రూ. 6,025, పింజ రకం పత్తికి రూ. 5,726 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీంద ర్గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, డైరక్టర్లు మామి డాల నర్సింహా, అనంతుల జంగారెడ్డి, బద్దు నాయక్ పత్తిపాటి మంజుల, బూడిద అయిలయ్య, గుంటి కృష్ణ, మల్లేశ్గౌడ్, మహేందర్రెడ్డి, సత్యనారాయణ గుప్తా, రవీందర్గుప్తా, నాయకులు మిట్ట వెంకటయ్య, సూర్యనారాయణ పాల్గొన్నారు.