చౌటుప్పల్, సెప్టెంబర్ 20 :దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని, ఇలాంటి నాయకుడు తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు అబ్బురపడుతున్నారని, దేశానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తేనే అలాంటి పథకాలు తమకూ వస్తాయని ఆశ పడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆకలి చావులు, రైతుల ఆత్యహత్యలు ఉండేవని, వీటిని చూసి చలించిన కేసీఆర్ పదవులను తృణప్రాయంగా వదిలి ఉద్యమ బాట పట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష సైతం చేసి ఏడు దశాబ్దాల కలను సాకారం చేసిన ధీశాలి మన ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా మార్చడమేగాక రైతుబంధు, రైతుబీమా,కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, దళిత బంధు వంటి పథకాలతో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ కుటిల రాజకీయాలకు తెర లేపుతున్నదని, ఆ పార్టీ ఆటలు ఇక్కడ సాగవని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటను తప్పకుండా పాటిద్దామని.. కార్యకర్తలే పార్టీకి బలమని, క్రమ శిక్షణతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతోపాటు పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు హాజరుకాగా, కార్యక్రమం ఆసాంతం సంబురంగా సాగింది.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన టీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తేనే తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ రాష్ర్టాల్లోని అమలవుతాయని ఇతర రాష్ర్టాల ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఆకలి చావులు, రైతుల ఆత్యహత్యలకు నిలయంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే మన బతుకులు బాగుపడుతాయని సీఎం కేసీఆర్ భావించారని, అందుకే పదవులను తృణపాయంగా త్యజించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపారన్నారు.
‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ కల సాకారం చేసిని ధీశాలి అని కొనియాడారు. తెలంగాణను 70ఏండ్లుగా పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారిని కేవలం ఆరేండ్లలో కూకటివేళ్లతో సహా పెకిలించారన్నారు. రూ.20వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికి ఫ్లోరైడ్ రహిత నీరు అందిస్తున్నారని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రూ.లక్షల కోట్లతో అద్భుతమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని కొనియాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును అభివృద్ధి చెందిన అమెరికా, చైనా దేశాల్లో సైతం నిర్మించలేదని తెలిపారు. దళిత, గిరిజన బంధు లాంటి పథకాలు ప్రధాని గతంలో పాలించిన గుజరాత్ రాష్ట్రంలో సైతం లేవన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఒర్వలేక బీజేపీ ఇక్కడ కుటీల రాజకీయాలకు తెరలేపేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. వారి కుట్రలు, కుతంత్రాలు తెలంగాణలో సాగవన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని క్రమశిక్షణతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్రావు, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్యాదవ్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండలాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్రెడ్డి, గిర్కటి నిరంజన్గౌడ్, ప్రధాన కార్యదర్శులు గుండబోయిన వెంకటేశ్యాదవ్, ఢిల్లీ మాధవరెడ్డి, యూత్ అధ్యక్షుడు నారెడ్డి అభినందన్రెడ్డి, నాయకులు తొర్పునూరి నర్సింహగౌడ్, షాదీఖానా చైర్మన్ ఎండీ.ఖలీల్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీజేపీకి గుణపాఠం చెప్పాలి
కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి డిపాజిట్ రాకుండా చేసి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి బీజేపీ ఓర్వలేక చిల్లర రాజకీయాలకు తెరలేపుతుందన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత బిడ్డలను దివ్యాంగులుగా మార్చిన ఫ్లోరైడ్ బూతాన్ని సీఎం కేసీఆర్ అంతమొందించారని తెలిపారు. బీజేపీ వికృత రాజకీయ క్రీడలో పావుగా మారిన రాజగోపాల్రెడ్డి కేవలం తన కాంట్రాక్టుల కోసమే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని, మునుగోడులో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామన్నారు.
–ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
బీజేపీకి చరమగీతం పాడాలి
దేశంలో బీజేపీ చేస్తున్న వికృత రాజకీయ క్రీడకు మునుగోడు వేదికగా చరమగీతం పాడాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో తాను గెలిచాక మూడున్నరేండ్లలో సీఎం కేసీఆర్ రూ.3500కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే నిధుల వరద పారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే మునుగోడు రూపురేఖలు మారుతాయన్నారు.
–ఎమ్మెల్యే శానంపూడి
రూ.22వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డి
నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి రాజగోపాల్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూ.22వేల కోట్లకు బీజేపీకి తన పదవిని అమ్ముకున్నాడని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విమర్శించారు. గెలిచిన మూడున్నరేండ్లలో నియోజకవర్గ అభివృద్ధి ఆయనకు పట్టలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందున అభివృద్ధి జరగట్లేదని చెబుతున్న రాజగోపాల్రెడ్డి తిరిగి ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపికి ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. కేవలం తన కాంట్రాక్టుల కోసమే ఆయన పాకులాడుతారని, ప్రజల బాధలు పట్టవని పేర్కొన్నారు. టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు తెచ్చి మునుగోడుకు పూర్వవైభం తెస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దీన్ని తమ ఎన్నికగా భావించి ఓటు వేయాలని కోరారు.
–మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి