మంత్రి మల్లారెడ్డికి ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి వినతి
యాదాద్రి, మార్చి 12 : బొమ్మలరామారం మండలంలోని బండకాడిపల్లి నుంచి తూంకుంట వరకు డబుల్ లైన్ రోడ్డు మంజూరుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి శనివారం వినతిపత్రం అందించారు. రూ. 1.80కోట్లతో ఆర్అండ్బీ రోడ్డు పూర్తి చేస్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని హుషారుపల్లి, ఉద్దమర్రి, కేశవపురం గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దీంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బండకాడిపల్లి, తూంకుంట ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ప్రతిపాదనలు పంపి మంజూరుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ మంత్రిని కోరారు. బండకాడిపల్లి నుంచి తూంకుంట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కృషి చేయడంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు గాను ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డికి బండకాడిపల్లి సర్పంచ్ బూడిద శంకర్గౌడ్, మండల నాయకులు పెద్దిరెడ్డి మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.