ఆత్మకూరు(ఎం), మార్చి 12 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇంటి నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చి డబ్బా కొట్టుకోవడంతోపాటు నీచంగా ఇంటికి 3 రంగుల గుర్తులు వేసి మురిసిపోయారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సొంత జాగా ఉన్న ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించి భరోసా కల్పించారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల ప్రకటన చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశ్గౌడ్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు లగ్గాని రమేశ్గౌడ్, మాజీ మండలాధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య, మాజీ వైస్ ఎంపీపీ కాలె మల్లేశం, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మల్లెల పర్వతాలు, అధికార ప్రతినిధి యశ్వంత్కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథగౌడ్, రైతు విభాగం మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి పాల్గొన్నారు.