చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 10 : అతనొక్క పాల వ్యాపారి. వ్యవసాయం చేసుకుంటూ దానికి ప్రత్యామ్నాయంగా 25 ఏండ్లు పాల బేరం చేశా డు. వృత్తిలో భాగంగా ప్రతిరోజూ పలువురు రైతు ల వద్ద పాలు సేకరించేది. రసాయన ఎరువుల మూలంగా రైతులు పడ్డ కష్టాలు సైతం కండ్లరా చూశాడు. దాని నిర్మూలన కోసం ప్రయత్నించా డు. ఎనుకట గో ఆధారిత సేద్యంతో పంటలు పండించి వందకిలోల బరువైనా అవలీలగా లేపే వార ని చెప్పేవాడు. ప్రస్తుతం 12 ఏండ్లకే అద్దాలు, తెల్ల వెంట్రుకలు, 45 ఏండ్లు నిండిన వెంటనే ముసలి తనం వస్తున్నదని మిగతా రైతులతో చర్చించేవాడు.
రసాయన ఎరువులతో పంటలు పండించడం పూర్తిగా పక్కన పెట్టాలని వాదించేవాడు.. అయినా ఫలితంలేదు. దీనికి తోడు తన వ్యవసాయ పొలంలో చల్లిన గుళికల మందు మూలంగా ఆవు మృత్యువాత పడింది. అంతేకాకుండా గ్రామంలో కాడెండ్లకు పట్టిన పురుగులను తొలగించేందుకు ఓ రైతు గ్రోమోర్ను చల్లాడు. దీంతో ఆ రెండు మూగజీవాలు ప్రాణాలు విడిచాయి. ఈ రెండు ఘటనలు అతన్ని కలచివేయడంతో ‘గో’ ఆధారిత పంటలు పండించాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది తాన లక్ష్యానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన రైతు నూనె శ్రీనివాస్ యాదవ్ తన రెండు ఎకరాల పొలంలో గోఆధారిత పంటలు సాగు చేస్తున్నాడు. గో మూత్రం రసాయన మందుగా, గోపేడను ఎరువుగా సేద్యానికి వాడి అధిక దిగుబడు లు సాధిస్తున్నాడు. ప్రధానంగా దోస, టమాట, బీర, వంకాయ, పచ్చిమర్చి, ఉల్లిగడ్డ, చిక్కు డు, కొత్తిమీర, పుదీనతోపాటు వివిధ రకాల ఆకుకూరలను పండిస్తున్నాడు. ప్రతి రోజూ తన ఇంటి అవసరాలకు సరిపడా తీసుకొని మిగతావి ఓ కౌంటర్ వద్ద పోస్తున్నా డు. అవసరమైన వారు వాటిని తీసుకొని తమకు తోచిన నగదు కౌంటర్లో వేయాలని కోరుతున్నాడు. గోవులను సాకు తూ వాటి పాలను కూడా నామ మాత్రపు ధరకు విక్రయిస్తున్నాడు. అంతేకాకుండా అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ గో ఆధారిత పంటలు సాగు చేయాలని వివరిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు.
గో మూత్రం నిల్వకు ట్యాంక్..
గో మూత్రానికి ప్రత్యేక ట్యాంక్ ఏర్పాటు చేసి దాంట్లో నిల్వ చేస్తున్నాడు. గోశాల నుంచి నేరుగా ట్యాంక్లోకి మూత్రం కషాయం వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. దానిని నిల్వ చేసి కొన్ని రోజుల తర్వాత పంట పొలాలకు విడుతల వారీగా పంపిణీ చేస్తున్నాడు. సేద్యానికి అవసరమైన విధంగా దానిని అందజేస్తున్నాడు.
తోచిన నగదు హుండీలో వేస్తాం..
అవసరమైన కూరగాయలను మొదట తీసుకుంటాం. తోచిన నగదును హుండీలో వేస్తాం. ఎలాంటి డిమాండ్ ఉండదు. రసాయనాలు వాడకుండా కూరగాయాలు అందించడం బాగుంది. అంతేకాకుండా రైతు శ్రీనివాస్ యాదవ్ గో ఆధారిత సాగుపై నిత్యం అవగాహన కల్పిస్తాడు. – కానుగు శ్రీకాంత్, కొనుగోలుదారుడు
ఆరోగ్యం బాగుంటుంది..
గో ఆధారిత సేద్యంతో ఆరోగ్యం బాగుటుంది. మూగజీవాలకు కూడా ఎలాంటి హానికలుగదు. గతంలో రసాయన ఎరువుల మూలంగా కలిగిన అనుభావాలతో ఈ సేద్యం చేపట్టా. వచ్చిన పంటను కూడా కొనుగోలుదారులు ఇచ్చినంతనే తీసుకుంటా. అందరిలో మార్పురావాలని ఇలా చేస్తున్నా. ప్రతిఒక్కరూ గో ఆధారిత సేద్యం చేపట్టాలి.