చౌటుప్పల్, ఏప్రిల్ 27: అతని పేరు మహేశ్ (పేరు మార్చాం). అతని తండ్రికి మంచి పేరు, పలుకుబడి ఉంది. ఇతను గుప్త నిధుల గురించి తెలుసుకొని తవ్వకాలు ప్రారంభించాడు. తన దగ్గ ర ఉన్న రూ. 5లక్షలతో పాటు మరో 20లక్షలు ప ది రూపాయల వడ్డీకి తెచ్చి తవ్వకాలు జరిపాడు. కానీ గుప్త నిధుల తవ్వకాల వల్ల ఒరిగింది ఏమి లేకపోగా రూ. 40లక్షల వరకు పోగొట్టుకున్నాడు.
మరొకతని పేరు విఘ్నేశ్వర్ (పేరు మార్చాం). ఇ సుక లారీ డ్రైవర్ కమ్ ఓనర్. గుప్త నిధుల మోజు లో పడి రూ. లక్షలు ఖర్చు పెట్టాడు. తనకు ఉన్న లారీని అమ్మి గుప్త నిధుల వేట కొనసాగించాడు. చివరకు లారీ పోవడంతో పాటు రూ. 15 నుంచి రూ. 20 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పును తీర్చేందుకు ఉన్న పొలం, ఇల్లును విక్రయించాడు. తన దగ్గర డ్రైవర్గా పనిచేసి లారీ కొనుగోలు చేసిన వ్యక్తి దగ్గర అతను డ్రైవర్గా మారాల్సి వచ్చింది.
ఇవి మచ్చుకు కొన్నే ..గుప్త నిధుల మోజులో పడి ఎంతో మంది తీవ్రంగా నష్టపోయి ప్రాణాల మీది కి తెచ్చుకుంటున్నారు. ఒక్క రోజులోనే కోటీశ్వరులు కావాలనే అత్యాశ వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నది. గుప్త నిధుల కోసం తమ కు టుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. బ్యాంక్లో ఉన్న డబ్బులతోపాటు రూ. లక్షలు అప్పు చేస్తూ లబోదిబోమంటున్నారు. సంస్థాన్నారాయణపు రం మండలంలోని రాచకొండ, చౌటుప్పల్, నా రాయణపురం తండాల శివారు ప్రాంతాల్లో గుప్త నిధుల వేట ముమ్మరంగా కొనసాగుతుందని తెలుస్తున్నది.
మంత్రగాళ్లను ఆశ్రయిస్తూ ..
గుప్త నిధుల తవ్వకాలు జరిపితే బంగారంతోపాటు వజ్ర, వైఢూర్యాలు పొందవచ్చని కొంత మంది మంత్రగాళ్లను నమ్ముతున్నారు. ఒక్క రోజులోనే కోట్లకు పడగలెత్తవచ్చని చెప్పి గుప్త నిధుల ఉచ్చులోకి దింపుతారు. తామే స్థలం చూపిస్తామని, ఆ స్థలంలో తవ్వకాలు జరిపితే భారీగా బంగారం, వెండితో పాటు పురాతన వస్తువులు లభిస్తాయని ఆశచూపుతారు. దీనికి వేదికగా రాచకొండ లాంటి జనసంచారం లేని ప్రాంతాలను ఎంపిక చేస్తారు. అమాయకులను నమ్మించేందుకు ఎన్నో కథలు అల్లుతారు. తమను నమ్ముకున్న వారికి రూ. కోట్లలో లబ్ధిచేకూరిందని చెబుతారు. ఇది చాలా ఓపికతో కూడుకున్న వ్యవహారమని కొన్ని నెలల పాటు తవ్వకాలు జరుపాల్సి ఉంటుందని చెబుతారు. ఇది నిజమేనని నమ్ముతున్న కొంతమంది వారి మాయలో పడి తవ్వకాలు చేస్తారు. ఈ తవ్వకాలు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తవ్వకాలకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్న కేటుగాళ్లు రూ. లక్షలు గుంజుతారు. అర్ధరాత్రులు ఈ వ్యవహారం చేయాల్సి ఉంటుండటంతో .. నిధుల గుంతను తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ గుంతను తీసే నిపుణులను పెట్టుకోవాల్సి వస్తుంది. రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు వారికి ముట్ట చెప్పాల్సి ఉంటుంది. గుప్త నిధుల కోసం అన్వేషణ మొదలు పెట్టిన మొదటి ప్రయత్నంలో విఫలమైతే..డబ్బుల ఆశతో తిరిగి రెండు, మూడు, ఐదు, పది సార్లు ప్రయత్నించాల్సి వ స్తుంది. ఈతంతులో రూ. లక్షల్లో ఖర్చు పెట్టి ఎం తోమంది అమాయకులు నష్టపోతున్నారు.
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు
గుప్త నిధుల తవ్వకాల్లో ఇప్పటికే సంస్థాన్నారాయణపురం మండలంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. మండలంలోని రాచకొండలో జరిపిన తవ్వకాల్లో అతిపురాతనమైన ఎంతో విలువగల 11 అడుగుల పాలరాతి శివలింగం బయటపడింది. దీని విలువ రూ. కోట్లలో ఉం టుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాచకొండ కోట తో పాటు రామాలయం, గుర్రాలగుట్ట, నర్సింహులగుట్ట, కచేరి మండపం, ప్రాచీన శివాల యం, గిద్దల్ల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. రాచకొండ ఫోర్టులోని ఏడు దర్వాజల చుట్టూ ఈ గుప్త నిధుల తవ్వకాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం.