భువనగిరి టౌన్, మే 25: జిల్లాలో రెండో డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమం మంగళవారం తిరిగి ప్రారంభమైంది. పది రోజు ల తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడంతో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దకు పెద్ద ఎత్తున వచ్చారు. జిల్లాలో 23 వ్యాక్సినేషన్ సెంట ర్లుండగా మంగళవారం ఒక్కరోజు 5750మందికి రెండో డో సు వ్యాక్సిన్ వేశారు. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవ రి 16న ప్రారంభమైంది. ముందుగా ఫ్రంట్లైన్ వారియర్స్ కు టీకాలు అందజేసిన అధికారులు తర్వాత 60 ఏండ్లకు పైబ డిన వారికి, ఆ తర్వాత 45 ఏండ్లకు పైబడిన వారికి అందజే శారు. మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ మే 8న నిలిపివేసి న అధికారులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మే12 వరకు రెండో డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించారు.
మొదటి డోసు తీసుకున్న వారు 1,70,580
జిల్లాలో మే 8వ తేదీ వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు 45 ఏండ్లకు పైబడిన 1,70,580 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందజేశారు. ఆ తర్వాత రెండో డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా మే 9 నుంచి 12వ తేదీ వరకు 15419 మందికి రెండో డోసు వ్యాక్సిన్ అందజేశారు. మంగ ళవారం 5750 మందికి వ్యాక్సిన్ అందజేశారు. అంటే ఇప్ప టివరకు 21.169 మందికి రెండో డోసు వ్యాక్సిన్ అందజే యగా ఇంకా 1,49,411 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది.
అందుబాటులో 1512 వాయిల్స్
జిల్లాలో అందుబాటులో 1512 వాయిల్స్ కరోనా టీకా అం దుబాటులో ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు తెలిపారు. మంగళవారం 1312 వాయిల్స్ ప్రభుత్వం నుంచి వచ్చాయని తెలిపిన ఆయన 200 వాయి ల్స్ అప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. బుధవారం మరిన్ని వాయిల్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 15 12 వాయిల్స్తో 15120 మందికి రెండో డోసు టీకాను అం దజేయవచ్చని వివరించారు.
పీహెచ్సీని పరిశీలించిన కలెక్టర్
భువనగిరి పట్టణం అర్బన్ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అనితారామచంద్రన్ మంగళవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా రెండో డోసు వ్యాక్సిన్ పక్రియను అడిగి తెలుసుకున్న ఆమె వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చే వారికి ఉదయమే టోకెన్లు అందజేసి సమయాన్ని తెలియజే యాలని సూచించారు. తద్వారా వ్యాక్సిన్ సెంటర్ల వద్ద రద్దీ ఉండదని చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసే కార్య క్రమాన్ని ఉదయాన్నే ప్రారంభించాలని సూచించారు. రోజు కు కనీసం 200 మందికి వ్యాక్సిన్ వేయాలని, కావాల్సినంత వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ లీలావతి, సిబ్బంది పాల్గొన్నారు.
అడ్డగూడూరులో 70 మందికి వ్యాక్సినేషన్
అడ్డగూడూరు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో మంగళవారం 70 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మండ ల వైధ్యాధికారి నరేశ్ తెలిపారు.
బొల్లేపల్లి పీహెచ్సీలో
భువనగిరి అర్బన్: మండలంలోని బొల్లేపల్లి పీహెచ్సీలో మంగళవారం రెండో డోసు టీకా పంపిణీ చేశారు. కోవాగ్జిన్ తీసుకున్న 100 మందికి రెండో డోసు టీకా పంపిణీ చేసినట్లు డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
ఆలేరు సీహెచ్సీ వద్ద
ఆలేరు టౌన్: కొవిడ్ మొదటి డోస్ పూర్తి చేసుకున్న వారు రెండో డోస్ టీకా తీసుకునేందుకు మంగళవారం ఆలేరు సీహె చ్సీ వద్ద పెద్ద ఎత్తున జనం క్యూ కట్టారు. ఉదయం నుంచే భారీగా ప్రజలు తరలివచ్చారు. టీకా కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి అనురాధ పర్యవేక్షించారు. ఆమె వెంట ద వాఖాన సూపరింటెండెంట్ దినేశ్, జనరల్ ఫిజీషియన్ దుర్గ, మోటకొండూరు వైధ్యాధికారి రాజేందర్ ఉన్నారు.
యాదగిరిగుట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో
యాదాద్రి: కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభు త్వం ముందస్తు టీకాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. యాదగిరిగుట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది మంగళవారం పలువురికి కరోనా టీకా వేశారు. మొదటి డోస్ వేసుకుని గడువులోపు వచ్చిన వారికి సెకండ్ డోస్ మాత్రమే వేశామని వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్కుమార్ తెలిపారు. ఆన్ లైన్లో నమోదు చేసుకున్న వారు 100 మంది, నేరుగా వచ్చి న 115 మందికి టీకాను వేశామని అన్నారు.
ఆత్మకూరు(ఎం)లో వంద మందికి
ఆత్మకూరు(ఎం): కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా మొ దటి విడత టీకా వేయించుకున్నవారు తప్పకుండా రెండో వి డుత టీకా వేయించుకోవాలని మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వంద మందికి రెండో విడుత టీకాలు వేశా రు. కార్యక్రమంలో మండల అదనపు వైద్యాధికారి సృజన, ఆరోగ్య కార్యకర్త హేమలత, ఆథ శాహిన్ పాల్గొన్నారు.
నారాయణపురంలో 272మందికి వ్యాక్సిన్
సంస్థాన్ నారాయణపురం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 272మందికి రెండో డోస్ కోవ్యాగ్జిన్ వేసినట్లు వైద్యాధికారి దీప్తి తెలిపారు.
రామన్నపేట మండలంలో
రామన్నపేట: రామన్నపేట మండలంలో రెండో డోసు వ్యా క్సిన్ తీసుకోవడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి గుంపులు గుంపులుగా చేడంతో ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు అందరి నీ భౌతికక దూరంలో నిలబెట్టి వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారం భింపజేశారు. 285మందికి కో వ్యాగ్జిన్ రెండో డోసును అం దించినట్లు మండల వైద్యాధికారి రవికుమార్ తెలిపారు.
వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
వలిగొండ: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సిబ్బంది మొదటి డోసు టీకా వేసుకున్న వారి వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసుకుని టీకా కోసం వచ్చిన వారందరికి మంగళవారం రెండో డోసు టీకా వేశారు.
మోత్కూరులో 107 మందికి
మోత్కూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో మంగళవారం రెండో విడుతగా 107 మందికి కోవాగ్జిన్ టీకా వేసినట్లు వైద్యాధికారి చైతన్య కుమార్ తెలిపా రు. 45 నుంచి 59 వయస్సులోపు వారికి 67 మం దికి 60 ఎండ్ల పై బడిన వారికి 40 మందికి టీకా వేసినట్లు తెలిపారు.