భువనగిరి టౌన్/భువనగిరి కలెక్టరేట్, మే 13 : కొవిడ్ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో కొవిడ్ ఉధృతి, తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ అనితారామచంద్రన్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిలతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్సిజన్, సరిపడా మందులు అందుబాటులో ఉంచాలన్నారు. రెమ్డెసివర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన, సంబంధిత అధికారులు ఎప్పటికప్పు డు పర్యవేక్షించాలని సూచించారు. పాజిటివ్ కేసుల విషయంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ బాధితుల ఇంటి వద్ద హోం ఐసొలేషన్ సౌకర్యం లేని వారిని కొవిడ్ కేర్ సెంటర్లో చేర్పించి మెరుగైన వైద్యమందించాలన్నారు.
జిల్లాలోని ప్రభు త్వ దవాఖానల్లో కొవిడ్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులందరికీ మెడికల్ కిట్లు అందించాలన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ను పూర్తి స్థాయిలో విని యోగంలోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం విధించి న లాక్డౌన్కు ప్రజలు సామాజిక బాధ్యతగా సహకరించాలని కోరారు. కొవిడ్ కట్టడి విషయంలో కేంద్రం నుంచి రావాల్సినంత సహకారం లభించలేదన్నారు. జిల్లాలో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్యసేవలు, మందులు, ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉన్న తీరు ను ఆయన సమీక్షించారు. అనంతరం జిల్లాలో కొవిడ్ పరిస్థితులు, తీసుకున్న చర్యలతోపాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసిన ఇంటింటి జ్వర సర్వే వివరాలను కలెక్టర్ అనితారామచంద్రన్ మంత్రికి వివరించారు.
ఇప్పటికే 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో రోజుకు పదివేల మెట్రిక్ టన్నుల చొప్పున ఇప్పటికే 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మరో 15 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతుందని చెప్పిన ఆయన యాసంగిలో ఈ సారి ధాన్యం ఎక్కువగా పం డిందన్నారు. అందుకే జిల్లాలోని మిల్లులకు రెండింతల ధాన్యం కేటాయిస్తున్నామని చెప్పారు. లారీలు పరిమిత సంఖ్యలో ఉన్నందున రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని తెలిపారు. రైస్మిల్లర్లు రైతులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, కీమ్యానాయక్, డీసీపీ నారాయణరెడ్డి, డీఎంహెచ్వో సాంబశివరావు, డాక్టర్లు పాల్గొన్నారు.