ఆలేరు టౌన్, ఏప్రిల్ 9 : కరోనా ఎఫెక్ట్తో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆన్లైన్ బోధన జరుగుతున్నా చాలా ప్రైవేటు పాఠశాలల యాజమా న్యం కొద్ది మంది టీచర్లను ఉంచి సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. కొవిడ్ ప్రభావంతో ఫీజులు వసూలు కాక ఇటు ఉపాధ్యాయులకు అటు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఉపాధి లేక అల్లా డుతున్న ప్రైవేటు టీచర్లకు నెలకు రూ. 2వేలతో పాటు 25 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు పాఠశాల ల్లో బోధిస్తూ దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 9,10వ తరగ తి విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. ఆ తరువాత 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా క్లాసులు నిర్వ హించారు. వైరస్ సెకండ్ వేవ్ వ్యాపిస్తుండడంతో విద్యార్థు లు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్చి 24 నుంచి విద్యాసంస్థలను మూసివేశారు. వీరి పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠ శాలల్లో పనిచేస్తున్న టీచర్లను ఆదుకోవాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 135 ప్రైవేటు పాఠశాలలు ఉండగా ఇందులో సుమారు 4 వేల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తు న్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపా ధ్యాయులను ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇందుకు సంబంధించి బోధన, బోధనేతర సిబ్బంది తమ బ్యాంకు అకౌంట్ వివరాలతో కలెక్టర్లకు దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యంతో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది
ఏడాదిగా పాఠశాలలు పని చేయక పోవడంతో అనేక ఇబ్బందులు ప డుతున్నాం. సీఎం కేసీఆర్ తీసుకు న్న నిర్ణయం స్వాగతిస్తున్నాం. ఇ ప్పటికే ఎంతో నష్టపోయాం. కరోనా కారణంగా ఉపాధి లేక ఎన్నో ఇక్కట్లు పడ్డాం. ఈ సమయంలో కేసీఆర్ మం చి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నెలల ముందు ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. ప్రత్యా మ్నాయ ఉపాధి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-గుజ్జ హరికృష్ణ, ప్రైవేటు టీచర్, ఆలేరు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
గత ఏడాది మార్చి నుంచి పాఠ శాలలు మూతపడడంతో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. మా పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ నెలకు రూ. 2వేలు, 25 కేజీల బియ్యం ఇవ్వాల ని నిర్ణయించడం సంతోషంగా ఉంది. ఈ విషయమై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా.ప్రైవేటు పాఠ శాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు స్కూళ్లు పని చేయని కాలం నుంచి రూ. 2వేలు చెల్లిస్తే బాగుంటుంది.
-యాకుబ్, ప్రైవేటు టీచర్, ఆలేరు
సీఎం నిర్ణయం హర్షణీయం
ప్రైవేటు టీచర్లకు రూ. 2వేలు, 25 కేజీల బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హ ర్షణీయం.నగదుతో పాటు బియ్యం ఇవ్వడం కొంత ఊరట కలిగించే అంశం. విపత్తు సమ యంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం తనవంతుగా ఆదుకోవడం ఎంతో మందికి ధై ర్యాన్ని ఇచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 10వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తే బాగుంటుంది.
– జూకంటి సిద్దులు, ప్రైవేటు టీచర్, ఆలేరు
ఇవీ కూడా చదవండి…
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి