యాదాద్రి భువనగిరి, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని 2018 వానకాలం సీజన్ నుంచి ప్రారంభించింది. తొలిసారి ఎకరాకు రూ.4వేలు సా యం అందించగా.. 2019 వానకాలం నుంచి ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. జిల్లాలో 2020 వానకాలంలో 2,03,509 మంది రైతులకు రూ. 285.44 కోట్ల సాయాన్ని అందించగా.. 2020-21 యాసంగిలో 2,09,380 మంది రైతులకు రూ.288.93 కోట్ల సాయాన్ని అందించారు. ప్రతి యేటా రైతుల సంఖ్య పెరుగుతుండటంతో పంట సాయాన్ని కూడా ప్రభుత్వం పెంచుతూ వస్తున్నది. ప్రస్తుత వానకాలం సాగుకు జిల్లా వ్యా ప్తంగా 2,23,745 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ చెబుతున్న ది. అలాగే పార్ట్ ‘బీ’ నుంచి పార్ట్ ‘ఏ’లోకి మారి న భూములతోపాటు, ఆర్వోఎఫ్ఆర్ భూములకు సైతం రైతుబంధు సాయాన్ని వర్తింప జేస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో రైతుబంధు సాయం బడ్జెట్ మరింతగా పెరగనుంది.
గిరిజన రైతుకు దన్నుగా..
పోడు భూముల్లో ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు రైతుబంధు సా యాన్ని అందించేందుకు నిర్ణయించి సీఎం కేసీఆర్ గిరిజన రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నా రు. చిన్న, సన్నకారు రైతులకు ప్రతి సీజన్లోనూ పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వస్తుండగా.. జిల్లాలో గత రెండు సీజన్ల నుంచీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులకూ సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. జూన్ 10వ తేదీని కటాఫ్ డేట్గా పెట్టుకుని ఆ తేదీ వరకు గుర్తించిన మరింత మం ది రైతులకూ సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ ఔదార్యంతో తీసుకున్న నిర్ణయం గిరిజన రైతు కుటుంబాలకు గొప్ప ఊరట కలిగిస్తున్నది. ప్రస్తుతం 168 మంది రైతులకు సంబంధించిన 435 ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అందుతుండగా..ప్రభుత్వ తాజా నిర్ణయంతో సాయం పొందే గిరిజన రైతుల సంఖ్య మరింతగా పెరగనుంది. అదేవిధంగా పార్ట్ ‘బీ’ నుంచి పార్ట్ ‘ఏ’లోకి చేరిన భూములకు వానకాలం రైతుబంధు ను వర్తింపజేయనుండటంతో ఆయా రైతుల లెక్కలను అధికారులు తీస్తున్నారు. ఇలా మారిన ఖాతాలు 2020 సెప్టెంబర్ 14 నుంచి 2021 మే 31 వరకు 522 ఖాతాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. జూన్ 10 వరకు కటాఫ్ డేట్గా ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ తరహా ఖాతాల సంఖ్య కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది.
రైతుల బ్యాంకు ఖాతా నెంబర్ల సేకరణ..
రైతుబంధు పథకానికి అర్హులైనప్పటికీ జిల్లాలో చాలామంది రైతులు సాయానికి దూరంగా ఉన్నా రు. ఈ పథకం కింద సాయం పొం దాలంటే రైతులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా నెంబర్, ఆధార్కార్డు నెంబర్ వివరాలను వ్యవసాయశాఖ అధికారులు అందజేయాలి. చాలా వరకు రైతులు ఈ వివరాలను ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. బ్యాంకుల విలీనం కారణంగా రైతుల ఖాతాల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రాబ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాం కు, దేనా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తదితర బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఈ బ్యాం కుల్లో గతంలో ఖాతాలు కలిగిన రైతులు ప్రస్తు తం అవి ఏ బ్యాంకు పేరుతో ఉన్నాయో! ఆ వివరాలను జూన్ 10లోగా వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 2,23,745 ఖాతాలకుగానూ 1,78,618 బ్యాం కు ఖాతాలు మాత్రమే సక్రమంగా ఉండి సాయం జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏవోలకు గానీ.. ఏఈవోలకు ఆధార్ కార్డు, కొత్త బ్యాం క్ పాసుపుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం జిరా క్స్ కాపీలను అందజేయాలని, లేనిపక్షంలో రైతు బంధు సాయం అందదని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తున్నది.
పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు
జూన్ 15 నుంచి 25 తేదీలోగా వానకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. భూమి విస్తీర్ణం వారీగా రైతుల జాబితాలను సిద్ధ్దం చేస్తున్నాం. ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూములకు, పార్ట్ ‘బీ’ నుంచి పార్ట్ ‘ఏ’లోకి మారిన భూములకు రైతుబంధు సాయం వర్తింపజేసే దిశగా చర్యలు చేపడుతున్నాం.
-శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్(రెవెన్యూ), యాదాద్రి భువనగిరి జిల్లా