భువనగిరి టౌన్, జూన్ 03: లాక్డౌన్ సమయంలో నిరుపేద లకు ఉచితంగా భోజనం అందించాలనే సదుద్ధేశ్యంతో అన్నపూ ర్ణ భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని ప్ర భుత్వ బాలుర జూనియర్ కళాశాల ముందర భువనగిరి ము న్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజన శాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారందరికీ ఉచితంగా భోజనం అందించాలని సంకల్పంతో అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కిష్టయ్య, కౌన్సిలర్లు దశరథ, కిరణ్కుమార్, మున్సిపల్ డీఈ శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నరేశ్, నాయకులు రాజేష్, పాండు పాల్గొన్నారు.
భోజన ప్యాకెట్ల అందజేత
లాక్డౌన్ నేపథ్యంలో పట్టణంలోని పేదలకు, యాచకులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులకు 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేశ్, టీఆర్ఎస్ వార్డు కమిటీ అధ్యక్షుడు గాదె శ్రీనివాస్లు భోజన ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో శ్రవణ్, సంకీర్త్, నరేశ్, శేఖర్ పాల్గొన్నారు.