యాదాద్రి : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను అక్కున్న చేర్చుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు.
మునిపంపుల, ఇంద్రపాలనగరం గ్రామాల్లో కోటి పైచిలుకు వ్యయంతో చేపట్టనున్న పలు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా మునిపంపుల గ్రామంలో రూ.15 లక్షల సీసీ రోడ్ల పనులకు, మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల మరమ్మతులకు రూ. 25 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
ఇంద్రపాలనగరం గ్రామంలో రూ. 25 లక్షల సీసీ రోడ్ల పనులు, మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల మరమ్మతుల కోసం రూ. 32 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ఒక సంచలనమేనని అన్నరు.
ప్రధానమంత్రి మోదీవన్నీ దొంగ హామీలేనన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని, మోదీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులంతా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.