డివైడర్ను ఢీకొని ఒకరు..
భువనగిరి అర్బన్: ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీ కొట్టి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ రామ్నగర్ మేడిబాయి బస్తీకి చెందిన నెర్రోలు రఘురాం(26) శనివారం రాత్రి ఎనమిది గంటలకు దావత్ ఉందని స్నేహితులతో కలిసి బైక్పై హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వచ్చాడు.
బోనాల పండుగ కోసం తిరిగి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1గంటకు బైక్పై హైదరాబాద్కు వెళుతుండగా మార్గమధ్య లో రాయగిరి రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ వద్ద బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడరును ఢీ కొట్టడంతో త్రీవ గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 ద్వారా ఏరియా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. రఘు రాం తండ్రి నర్సింగ్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్సై సైదులు తెలిపారు.
ఉరేసుకుని ఒకరు..
ఉరివేసుకుని వ్యక్తి ఆత్యహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి పట్టణం రాయగిరి పరిధిలోని రైల్వే స్టేషన్ వద్ద నివాసం ఉండే సిలివేరు శ్యామ్సుందర్ (31)కు ఐదు సంవత్సరాల క్రితం బొల్లేపల్లి కి చెందిన శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. కాగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శ్రీలత పుట్టింటికి వెళ్లింది.
మనస్థాపానికి గురైన శ్యామ్సుందర్ ఈనెల 7వ తేదీ రాత్రి ఇంటి పై కప్పుకు ఉరేసుకుని మృతి చెందాడు. శ్యామ్సుందర్ అత్తమామలు, భార్య తరపు బంధువుల వేదింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కటుంబసభ్యులు ఆరోపిం చా రు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు ధర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సైదులు తెలిపారు.