యాదగిరిగుట్ట,యాదాద్రి : స్వయంభూ పంచనారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి (Laxminarasimha Swamy) ఆలయంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారు వేణుగోపాల స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ తిరువీధులల్లో స్వామివారిని ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పలు ఏర్పాట్లు చేశారు.