తుర్కపల్లి: ఆరోగ్య తెలంగాణే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహనిధి నుంచి మంజూరైన రూ.3లక్షల 5వేలు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదన్నారు. పేద ప్రజలకు సీఎం రీలీఫ్ఫండ్ ద్వారా కార్పొరేటర్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.