భువనగిరి కలెక్టరేట్, జూన్ 23 : జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్షకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతున్నట్లు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భువనగిరిలో-35, బీబీనగర్-1, ఆలేరు-6, యాదగిరిగుట్ట-3, మోతూర్-1, రాజాపేట-1, బొమ్మలరామారం-1, రామన్నపేట-2, వలిగొండ-2, చౌటుప్పల్-15, భూదాన్పోచంపల్లిలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షకు 19,800 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందనారు. పరీక్ష కేంద్రంలోకి 9.45 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, నిమిషం ఆలస్యమైన అనుమతించబడదన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని, ఏదైనా గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి హాజరు కావాలన్నారు.