రాజాపేట, ఫిబ్రవరి 25 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రఘునాథపురం, దూదివెంకటాపురం, సోమారం, పారుపల్లి, బొందుగుల, బూర్గుపల్లి, మల్లెగూడెం, కుర్రారం, జాల, కొత్తజాల, సింగారం గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో తగ్గేదేలేదని, అంచెలంచెలుగా అనేక పనులు ప్రారంభించుకుంటున్నామని అన్నారు. అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చేయాలని కోరారు. రాష్ట్రంలో అందరి బాగు కోసం నిరంతరం తపిస్తున్న నాయకుడు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, బీజేపీ నాయకులు అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆగం చేసేందుకే ధ్యానం కొనుగోళ్లపై కేంద్రం కొర్రీలు పెడుతున్నదని, మోటర్లకు మీటర్లు బిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రూ.10 కోట్లతో పారుపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఊరికి రూ. 25 లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు పల్లె సంతోష్గౌడ్, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, డైరెక్టర్లు గుంటి కృష్ణ, చింతలపూరి వెంకట్రాంరెడ్డి, అర్కాల గాల్రెడ్డి, సర్పంచులు కంచర్ల శ్రీనివాస్రెడ్డి, గుంటి మధుసూదన్రెడ్డి, గాడిపల్లి శ్రవణ్కుమార్, ఠాకూర్ ధర్మేందర్సింగ్, గొడుగు రాజు, ఎడ్ల స్వరూపారాంచంద్రారెడ్డి, వస్పరి ధనలక్ష్మీవిష్ణు, పెరమాండ్ల కిషన్, కర్ల కరుణాకర్రెడ్డి, పరిమళ, మమత, ఎంపీటీసీలు రాపోలు కవితాతిరుపతిరెడ్డి, సుమలతాలక్ష్మారెడ్డి, నాయకులు భాస్కర్గౌడ్, ప్రవీణ్, వెంకటేశ్గౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, జశ్వంత్, తిరుమలేశ్, ప్రమోద్సింగ్, రాజు పాల్గొన్నారు.