యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం చిట్టన్నబావి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ట్రాక్టర్ డ్రైవర్కు గుండెపోటు రావడంతో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్యతో సహా ఇద్దరు కూలీలు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. శేరిగూడెంలో ఇటుకలు దింపి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన కూలీలు సీతారాం, దుర్గ.. ఇద్దరు ఏపీ వాసులుగా గుర్తించారు.