రాజాపేట, మార్చి 13 : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యులకు సూచించారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖాన ఉద్యోగుల రిజిస్టర్ హాజరు శాతాన్ని పరిశీలించారు. డాక్టర్ మోజేష్ ను దవఖానకు వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సాధారణ ప్రసవాలను పెంచాలన్నారు. దవాఖానలోని ఆపరేషన్ థియేటర్ తో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం రాజపేటలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ ను కలెక్టర్ పరిశీలించారు.