యాదాద్రి భువనగిరి : శాసనమండలి ప్రోటెం చైర్మన్ వి. భూపాల్ రెడ్డి (Protem Chairman) శనివారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం కొండపైన తాత్కాలిక షెడ్డు నిర్మాణానికి రూ. 11 లక్షల నగదును ఈవో భాస్కరరావుకు విరాళంగా అందజేశారు.
రెండు నెలల క్రితం స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ తనను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచాలని కోరుతూ స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కును చెల్లించేందుకు ఆలయాన్ని సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట శాసనమండలి మాజీ చీఫ్ సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి , చైర్మన్ బంధువులు రాజేశ్వర్ రెడ్డి, తులసి రెడ్డి, మల్లిక్ రెడ్డిచ నర్సింహారెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి , బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పెలిమిల్లి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.