భువనగిరి కలెక్టరేట్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పాటు ఇతర ప్లాంటేషన్ లక్ష్యాన్ని వారంలోగా నూటికి నూరు శాతం సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం అదనపు కలెక్టర్ దీపక్తివారీతో కలిసి కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, ప్లాంటేషన్ లక్ష్యాలు నిర్ధేశించిన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం క్రింద 30 లక్షలు నాటడానికి గాను ఇప్పటివరకు 40శాతం లక్ష్యాన్ని, ప్లాంటేషన్ క్రింద నిర్ధేశించిన 22లక్షల మొక్కలు నాటడానికి గాను 53శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలి పారు. మిగిలిన లక్ష్యాన్ని మున్సిపల్ కమిషనర్లు, అధికారులు వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేపట్టి ఆన్లైన్ పోర్టల్లో విధిగా అప్డేట్ చేయాలన్నారు. ఇప్పటివరకు గత 15 రోజులుగా పొడి వాతావరణం ఉన్నందున ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టని కారణంగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, రుతుపవనాలు సద్వినియోగం చేసుకుని విసృతంగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ కోరారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ కూడా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఆన్లైన్లో నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాలల్లో చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఫోటోలు తీసి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
రోజు వారీగా చేపట్టిన ప్లాంటేషన్ను ఆలన్లైన్ పోర్టల్లో నమోదు చేసి నివేదికలివ్వాలని జిల్లా అటవీశాఖ అధికారిని కోరారు. మోత్కూరు మున్సి పాలిటీ 5200 మొక్కల లక్ష్యానికిగాను 103శాతం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 11,900ల మొక్కలకు గాను 101శాతం, ఆలేరు మున్సిపా లిటీ 5420 మొక్కల లక్ష్యానికిగాను 95 శాతం, పోచంపల్లి మున్సిపాలిటీ 23680 లక్ష్యానికి గాను 96 శాతం లక్ష్యం సాధించినట్లు మున్సిపల్ కమిషనర్లు వివరించారు. గూగుల్మీట్లో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, డీపీవో, జిల్లా వ్యవసాయ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ, ప్రోహిబీషన్ ఎక్సైజ్, విద్య, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు.