భూదాన్ పోచoపల్లి, ఫిబ్రవరి 11 : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూదాన్ పోచoపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 24లో డోర్ క్లోజ్ చేసి ఎన్నికల సిబ్బంది భోజనాలు చేశారు. దీంతో ఓటర్లు 10 నిమిషాల సేపు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బూత్ డోర్ బంద్ చేయకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి భోజనాలు చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించడంతో ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశంతో పాటు అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ ప్రశ్నించారు. గొడవ జరుగుతుందని తెలుసుకుని చౌటుప్పల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లు మాత్రమే ఉండాలని పోలీసులు సూచించారు. బూత్ నెంబర్ 24లో డోర్ బంద్ చేయడం పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.

భోజనాల కోసం పోలింగ్ బూత్ డోర్ క్లోజ్