మోటకొండూర్: మోటకొండూర్ మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం పార్టీ బలో పేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండ లంలోని పలు గ్రామాలకు చెందిన నూతన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ దంపతులను హైదరాబాద్లోని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం సభ్యులు గ్రామ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేసేందు కు పాటుపడాలన్నారు. పార్టీ నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు భూమండ్ల సుధీర్, పైళ్ల పాండురంగారెడ్డి, పీసరి వెంకట్రెడ్డి, పన్నాల నర్సి రెడ్డి, పోలిశెట్టి మార్రయ్య తదితరులు పాల్గొన్నారు.