భూదాన్పోచంపల్లి: ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గాభి వృద్ధే తన ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాల నాయకులు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. నియోజకవర్గంలోని అన్ని మండ లాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధా న్యమిస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీల తోపాటు ప్రధాన సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. జిబ్లక్పల్లిలో రూ.20లక్షల హెచ్ఎండీఏ నిధులతో చేపట్ట నున్న పలు అభివృద్ధి పనులకు, భీవనపల్లి గ్రామంలో రూ.20 లక్షలు, కనుముక్కులలో రూ.25 లక్షలతో, పెద్దగూడెం లో రూ.60 లక్షలతో చేపట్టనున్న అభి వృద్ధి పనులకు ఎమ్మెల్యే శేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, జడ్పీటీసీ పుష్పలతారెడ్డి, సింగిల్విండో చైర్మన్లు కందాడి భూపాల్రెడ్డి, అందెల లింగంయాదవ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సామ రవీంద ర్రెడ్డి, మాధవీశ్రీశైలంగౌడ్, రావుల శేఖర్రెడ్డి, గోరంటి శ్రీనివాస్రెడ్డి, భువనగిరి మా ర్కె ట్ కమిటీ డైరెక్టర్లు మాధవరెడ్డి, భిక్షపతి, చౌటుప్పల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు అంజిరెడ్డి, పద్మారెడ్డి, రాములు, లింగస్వామి, ఆర్ల లింగస్వామి, సుర్ంకంటి జంగారెడ్డి పాల్గొన్నారు.
చేనేతలకు అండగా ప్రభుత్వం
చేనేత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆర్థిక ఇ బ్బందులతో పాటు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన ఆరు కుటుంబాలకు ప్రభుత్వం అందించిన రూ.1.50 లక్షల పరిహారం చెక్కులను ఆయన పోచంపల్లి పట్టణంలోని చేనేత సహకార సంఘం డైహౌజ్లో అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకం కింద మొత్తం 15 కుటుంబాలకు ఆర్థిక సాయం అందగా పోచంపల్లి మండలంలోనే ఆరు కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందే చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయడం జరిగిందన్నారు.
తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత చేనేత కార్మికుల ఆర్థిక పురోగతి కోసం థ్రిఫ్టు పథకం తీసుకొచ్చారని అన్నారు. చేనేత కార్మికులకు చేనేత బీమాను తీసుకొ చ్చే ప్రయత్నంలో భాగంగా 2015 నుంచి 2018 వరకు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకునేందుకు బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చౌ టుప్పల్ ఆర్డీవో సూరజ్కుమార్, పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, ఎంపీపీ,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.