చౌటుప్పల్ రూరల్: నేతన్నలకు మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం మండలంలోని కొయ్యలగూడెంలో ముగ్గురు నిరుపేద కార్మికులకు ఆయన ఒక్కొ క్కటి రూ.30వేల విలువైన ఆసు యంత్రాలను సొంత ఖర్చులతో ఉచితంగా అందజేశారు.
మంత్రి కేటీఆర్ బర్త్డేను పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మయిల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. కార్యక్రమం లో మాజీ డీసీసీబీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, స్థానిక చేనేత సంఘం అధ్యక్షుడు వర్కాల శ్రీమన్నారాయణ, మాజీ స ర్పంచ్ మాచర్ల కృష్ణ, నాయకులు గోర్ల అశోక్, ఎర్రమాద వెంకన్న, పిల్లలమర్రి సాయి, రాఘవ, గజేందర్ పాల్గొన్నారు.