నేరేడుచర్ల, జూన్ 29 : పరీక్షల ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండటం సహజం. రిజల్ట్స్ ఎలా ఉంటాయో, తమకు ఏ గ్రేడ్ వస్తుందో అని విద్యార్థులు టెన్షన్ పడుతుంటారు. కానీ పరీక్షల ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందొద్దని, పాజిటివ్గా స్పందించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చాయని, చదివిన చదువుకు తగ్గట్లు గ్రేడ్ రాలేదని అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్క ఓటమితోనే తమ చదువు ముగిసిపోదని, ఉత్తమ గ్రేడ్ రాగానే హీరోలైపోరని గుర్తించాలంటున్నారు. పాసైనా, ఫెయిలైనా మార్కులు, గ్రేడ్లు ఎలా వచ్చినా సానుకూలంగా తీసుకుని దృఢంగా ఉన్నవారే నిజమైన విజేతలని చెబుతున్నారు.
పిల్లల మనస్తత్వాన్ని బట్టి వారికి గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచిస్తున్నారు. ఈ నెల 28న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు కొంత మంది ఆత్మహత్య చేసుకున్నారు. అది చాలా తప్పు. పాస్ అయితేనే జీవితం… లేకుంటే బతుకలేం అనే ఆలోచనను విరమించుకోవాలి. ఒక్కసారి ఓటమి మన విజయానికి నాంది అనుకోవాలి. కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులను జీవితాంతం బాధపడే విధంగా చేయకూడదు. నేడు విడుదలయ్యే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రిజల్ట్ ఎలా వచ్చినా పాజిటివ్గా తీసుకునే మనస్తత్వం అలవర్చుకోవాలి.
తల్లిదండ్రులు,స్నేహితులే అండ
పదో తరగతి చదివే విద్యార్థుల వయస్సు పూర్తిగా పరిణితి చెంది ఉండదు. పాసైనా, ఫెయిలైనా అతిగా స్పందిస్తుంటారు. మార్కులు, గ్రేడ్లు ఎక్కువ తక్కువ వచ్చాయన్న చిన్నపాటి సమస్యలే ఉంటాయి. కానీ ఫెయిలైతే మాత్రం సున్నిత మనస్కులు క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి సమయంలోనే వారికి తల్లిదండ్రులు, స్నేహితులు, అధ్యాపకులు అండగా నిలువాలి. జరిగిన దానికి బాధపకుండా భవిష్యత్ బాగుంటుందన్న దిశగా వారిని తీసుకెళ్లాలి. ఓటమితోనే గెలుపు బాట వేసుకోవాలంటూ వెన్నుతట్టి ప్రోత్సహించాలి.
ఈ విషయాలు మరువద్దు
పరీక్షల ఫలితాలు ఎలా వచ్చినా విద్యార్థులు పాజిటివ్గా ఉండాలి. విద్యార్థులతోపాటు కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు, చుట్టుపక్కల వారు ప్రవర్తించే తీరు ప్రభావం చూపుతుంది.విద్యార్థి ఇంతటితోనే అంతా అయిపోయిందన్న భావనను వీడాలి. కేవలం ఓ పరీక్షలో మాత్రమే ఫెయిలయ్యామని, జీవితంలో కాదన్న విషయాన్ని గ్రహించాలి.
క్షణికావేశానికి గురికావద్దు. తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తమలోని బాధను పంచుకోవడంతోపాటు నెగెటివ్ ఆలోచనలు దూరం పెట్టాలి.
సభ్యులు, స్నేహితులు ఫెయిలైన విద్యార్థులపై చులకన భావంతో ఉండకూడదు. ఎగతాళి చేసినట్టు మాట్లాడొద్దు.
వారికి తల్లిదండ్రులు, స్నేహితులు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారో.. ఫెయిలైన వారిని అలాగే వెన్నుతట్టి ప్రోత్సహించాలి.
చూపుతూ వారితో తూలనాడొద్దు.
ఫెయిలైనా జీవితంలో విజేతలుగా నిలిచిన వారి గురించి చెబుతూ ఉండాలి. పాజిటివ్గా ఆలోచిస్తూ బాగా చదివేలా సపోర్ట్ ఇవ్వాలి.
చేసినా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.