యాదాద్రి భువనగిరి : 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద నుంచి ఆలయ ఈవో ఎన్ గీత మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ ఆలయ అధికారులు పాదయాత్రగా యాదాద్రి పట్టణం కలియతిరిగారు. భారత్ మాతాకీ జై, లక్ష్మీ నరసింహ స్వామికి అంటూ సంకీర్తన యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్లు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.