బీబీనగర్: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికి తీసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2019 సంవత్సరంలో 10వ తరగతి చదివిన కె.శ్రావణి పొలంలో నడుస్తూ రైతులు పాముకాటుకు గురవకుండా ఉండడానికి చేతి కర్రను తయారు చేసి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఇన్నోవేషన్ సెల్ ప్రకటించిన ఆవిష్కరణకు ఎంపికయ్యింది.
రైతులు, వృద్ధులు సాధారణంగా వాడే చేతి కర్ర ద్వారా చాలా సమస్యలను పరిష్కరించేలా ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. రైతులు పొలంలో నడుసు న్నప్పుడు దీనీ నుంచి వచ్చే తరంగాలు ఆ దారిలోని పాములకు చేరి అవి అక్కడ నుంచి పారిపోయి రైతులు రక్షించబడుతారు. దీని బజర్ నుంచి వచ్చే శబ్దాల ద్వారా పొలంలో ఉన్న జంతువులు పారిపోతాయి.
ఈ కర్ర అడుగు భాగంలో ఉండే లైట్ రైతులకు, వృద్ధులకు రక్షణగా పనిచేస్తుంది. ఈ పరికరం ఇప్పటికే జాతీయ స్ధాయి ఇన్స్పైర్ పోటీల్లో ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికై ఎన్.ఐ.ఎఫ్ వారి పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోబడింది.