మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 8,10,11 వార్డుల్లో రూ.10 లక్షల చొప్పున మంజూ రు చేసిన నిధులతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను కల్పించి పని చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీరెడ్డి, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, గుర్రం కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పి రమేశ్, మహిళావిభాగం అధ్యక్షురాలు మల్లం అనిత, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.