యాదాద్రి భువనగిరి : జిల్లాలోని అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుమ్మల సురేందర్ రెడ్డి మృతి చెందారు. ఆయన భౌతిక దేహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తదితరులు ఉన్నారు.