రాజాపేట, మార్చి 21 : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో శనివారం సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న రెండు బోర్లలో కొత్త మోటార్లు బిగించి వినియోగంలోకి తీసుకొచ్చారు. దాంతో గ్రామంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టిన సర్పంచ్తో పాటు కాంగ్రెస్ జిల్లా నాయకుడు మెండు భాస్కర్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.