యాదాద్రి భువనగిరి : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా మారి వారి పెండ్లిళ్లు జరిపస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని 10 గ్రామాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 సంవత్సరాల నిండిన పేదింటి అడబిడ్డల వివాహాలకు కోసం రూ. 1,00,116 నగదును అందజేస్తూ అండగా ఉంటున్నారని తెలిపారు. పేదల కష్టాలను అర్థం చేసుకునే మనసు టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉందన్నారు.