యాదగిరిగుట్ట, యాదాద్రి : వరుస సెలువల కారణంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం కూడా భక్తులు(Devotees) పోటెత్తారు. వరుసగా ఆదివారం సెలవు, సోమవారం క్రిస్మస్, మంగళవారం బాక్సింగ్ డే సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వడంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం కూడా పెరిగిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఒక్కరోజే ఆలయానికి రూ. 54,64,760 ఆదాయం(Income) సమకూరిందని తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,18,992, కైంకర్యాల ద్వారా రూ. 800, సుప్రభాతం ద్వారా రూ. 12,100, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 5,63,100, వ్రతాలు నిర్వహించడం ద్వారా రూ. 1,68,800 ఆదాయం వచ్చిందని వివరించారు. వాహన పూజల ద్వారా రూ. 8,200, వీఐపీ దర్శనం ద్వారా రూ. 11,85,000, ప్రచారశాఖ ద్వారా రూ. 94,620, పాతగుట్ట ద్వారా రూ. 43,870, కొండపైకి వాహనాల ప్రవేశం వల్ల రూ. 6,50,000, యాదఋషి నిలయం ద్వారా రూ. 1,60,774 ఆలయానికి ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,74,012, శివాలయం ద్వారా రూ. 10,250, పుష్కరిణీ ద్వారా రూ. 1,350, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 19,98,100, శాశ్వత పూజల ద్వారా రూ.40,000 ఆదాయం వచ్చిందన్నారు. కళ్యాణ కట్ట ద్వారా రూ. 54,000, గోశాల ద్వారా రూ. 610, లిజెస్ లిగల్ ద్వారా రూ. 1,12,572 , అన్నదానం ద్వారా రూ. 55,220, ఇతర మార్గాల ద్వారా రూ. 12,390 ఆదాయం ఆలయానికి సమకూరిందని వివరించారు.