మోటకొండూర్: టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పార్టీ ప్లీనరీ, తెలంగాణ విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి గులాబీ దండు కదలి రావాలని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మోటకొండూర్ మండ ల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా టీఆర్ఎస్ ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై పార్టీ నాయకులకు ఆయన దిశానిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు, సీనియర్నాయకులు, కార్యక ర్తలు సైనికుల్లా పనిచేయాలని, పార్టీ ఆధిష్టానం పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా మెలగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 20 వసంతాలు పూర్తి చేసుకుని నవంబర్ 15న విజయగర్జన సభను పార్టీ ఆధిష్టానం నిర్వహించనుందని, ఈ సభకు మండల నుంచి భారీగా జనాన్ని సమీకరించాలన్నారు.
ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ, కాంగ్రె స్ పార్టీలు చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల కరెంట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. జనంమెచ్చిన నాయకుడిగా రాష్ట్రంలో మరో 20 వసంతాల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25న పార్టీ ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్లో జరుగను న్న తెలంగాణ విజయగర్జన సభను పార్టీ శ్రేణులు ఆధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంకల్పించిన ప్రతి కార్యక్రమాన్నికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొనాలన్నారు.
గొంగిడికి ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు..
టీఆర్ఎస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశాన్నికి విచ్చేసిన టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబెద్కర్ విగ్రహాన్నికి గొంగిడి పూలమాల వేశారు.
కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్ గౌడ్, రైతు బంధు మండల కన్వీనర్ భూమండ్ల ఐలయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, గ్రామాధ్యక్షుడు సుధీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అనంతుల జంగారెడ్డి, భూరెడ్డి రవీందర్రెడ్డి, మహిళ మండల అధ్యక్షురాలు బొలగాని నాగమణి, మాజీ మండలాధ్యక్షుడు దూదిపాల రవీందర్ రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు బీస కృష్ణంరాజు, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, యూత్ సెక్రటరీ జనరల్ పన్నాల నవీన్ రెడ్డి, బీసీ మండలాధ్యక్షుడు గౌరయ్య, సోషల్ మీడియా కన్వీనర్ బెజ్జంకి అనీల్రెడ్డి, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్ముద్, సీనియర్ నాయకులు లింగాల శ్రీకర్రెడ్డి, పల్లా జోగ్గిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.