భువనగిరి అర్బన్ : కరోనా నేపథ్యలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక చవితి సందర్భంగా జిల్లాలో భక్తులు, ప్రజలు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో కుల వృత్తిపై ఆధారపడిన కుమ్మరులకు కరోనా నేపథ్యంలో ఎంతో సహకారం అందుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 10న వినాయకచవితని పురస్కరించుకుని భక్తులు, ప్రజలు మట్టి గణపతులను ఏర్పాటు చేసి పర్యావరణ కాలుష్యం తగ్గించడంతో పాటు కుల వృత్తుల వారికి సహకరించిన వారవుతారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మట్టి గణపతులనే ఏర్పాటు చేయాలని తెలిపారు.