రామన్నపేట, జనవరి 02 : రామన్నపేట మండలం బోగారం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు కునూరు సాయికుమార్ గౌడ్ శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్టేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బత్తుల ఉమా రమేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముస్కు వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేశ్, వార్డు మెంబర్స్ గోగు ప్రమీల రమేశ్, మేడి ఆంజనేయులు, దేవి, నేరటి మానస సురేశ్, కడారి పావని పాపయ్య, గోగు సురేశ్, వనం అండాలు యాదగిరి, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ అంతటి ధనమ్మ మల్లేశం, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.