రాజాపేట, సెప్టెంబర్ 19 : బ్రిడ్జి నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలు దేవుడేరుగు. పనులు మాత్రం నత్తకు నడక నేర్పినట్లే కొనసాగుతున్నాయి. రాజాపేట మండలంలోని పారుపల్లి వాగులో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి 2023లో రూ.12.60 కోట్లు మంజూరు చేసి అట్టహాసంగా ప్రారంభించారు. అప్పటి నుండి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు నెలల నుంచి నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో రాజాపేట నుంచి పారుపల్లికి వెళ్లే వాహనాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి బ్రిడ్జిని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.