రాజాపేట, నవంబర్ 19 : నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైయిరీ సంస్థ పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని బుధవారం రాజాపేట మండలంలోని పారుపల్లి పాడి రైతులు పాల కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే 8 పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. బిల్లులు చెల్లించకపోవడంతో పశు పోషణతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు సత్వరమే చెల్లించకపోతే మదర్ డైరీపై పాడి రైతులు విశ్వాసం కోల్పోతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకుడు మోత్కుపల్లి నవీన్ కుమార్, పాడి రైతులు పాల్గొన్నారు.