రామన్నపేట, ఫిబ్రవరి 05 : మొయినాబాద్లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భవిష్యత్లో కూడా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకు రావాల్సిన అవసరం ఉందని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ మజీద్ తెలిపారు. నిరంతరం అడ్వకేట్ లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. ఆస్తి కోసం ఇలాంటి దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమన్నారు. ఆస్తి వివాదాల కోసం కోర్టులను ఆశ్రయించాలని, ఇలాంటి దాడుల వైపు వెళ్లొద్దన్నారు. ఈ కార్యక్రమములో బార్ అసోసియేషన్ ఉపాద్యక్షుడు యాదాసు యాదయ్య, సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్, కేమ రామదాసు, బసరాజు అశోక్ కుమార్, జగతయా, శ్రీశైలం, కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ పాల్గొన్నారు.