ఆత్మకూర్.ఎస్: మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50మంది కార్యకర్తలు ఆదివారం రాత్రి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బచ్చలకూరి భిక్షంతో పాటు 50మందికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆక ర్శితులై పార్టీలో చేరార న్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, మర్ల చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహారావు, బత్తుల రాజేంద్రప్రసాద్, గుంషావలి, బ్రహ్మం తదితరులు ఉన్నారు.