బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో డయాబెటిక్ రెటీనోపతిపై అవగాహన పెంచడానికి జనరల్ మెడిసిన్ కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్ విభాగాల సమన్వయంతో నేత్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ డయాబెటిస్ కారణంగా శాశ్వత అందత్వాన్ని నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్ నారంగ్, మెడికల్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్, పద్మశ్రీ ప్రొఫెసర్ ఎస్.నటరాజన్ పాల్గొన్నారు.