యాదాద్రి భువనగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఆలేరు మండల కేంద్రానికి చెందిన రెండో వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య, పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్, బొమ్మలరామారం ఎంపీపీ చమ్మల సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.